Ram Charan-NTR: సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్. ఆర్. వీరిద్దరి స్నేహం మరింత స్ట్రాంగ్ అయ్యింది. అప్పుడప్పుడు ఈ ఇద్దరు తారలు ఫ్యామిలీతో కలిసి పండుగలు, బర్త్ పార్టీస్ సెలెబ్రేట్ చేసుకుంటూ అద్భుతమైన క్షణాలను పంచుకుంటారు.
ఎయిర్ పోర్ట్ లో తారక్, రామ్ చరణ్
అయితే తాజాగా ఈ స్టార్ హీరోలు ఇద్దరూ హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నారు. వేర్వేరు ప్రదేశాలకు బయలుదేరిన వీరిద్దరూ ఒకే సమయంలో ఎయిర్ పోర్ట్ కు చేరుకోవడంతో.. అక్కడున్న కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ప్రముఖ బిజినెస్ మెన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం రామ్ చరణ్, ఉపాసన ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఇదే సమయంలో NTR31 చిత్రానికి సంబంధించి ప్రశాంత్ నీల్ తో మీట్ అండ్ గ్రీట్ సెషన్ కోసం బెంగళూరు వెళ్లారు తారక్. చాలా కాలం తర్వాత ఇలా ఇద్దరు అభిమాన హీరోలు ఒకేసారి కలిసి కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నిశ్చతార్థం.. వైరలవుతున్న ఫొటోలు