T20 World Cup 2024: సెమీస్ లో టీమిండియా.. ఎవరితో.. ఎప్పుడు ఆడుతుందంటే..

టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024 సెమీస్ కి చేరుకుంది. సెమీస్ లో ఇంగ్లాండ్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ జూన్ 27న భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు జరుగుతుంది. 2022 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైన టీమిండియాకు ఇప్పుడు ప్రతీకారం తీసుకునే ఛాన్స్ వచ్చింది 

T20 World Cup 2024: సెమీస్ లో టీమిండియా.. ఎవరితో.. ఎప్పుడు ఆడుతుందంటే..
New Update

T20 World Cup 2024 Semi Final:  టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. సూపర్-8 చివరి మ్యాచ్‌లో, టీం ఇండియా (India) ఆస్ట్రేలియాను గెలవకుండా అడ్డుకుంది.  దీనితో వరుసగా రెండవ ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించింది. టీమ్ ఇండియా తన గ్రూప్-1లో మొదటి స్థానంలో నిలిచింది - ఫైనల్ 4కి చేరుకుంది.  సెమీస్ లో  ఇప్పుడు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. దీంతో రెండేళ్ల క్రితం ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి ఇప్పుడు టీమ్ ఇండియాకు  ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. 

సూపర్-8లో మొదటి, రెండో మ్యాచ్‌లు గెలిచిన తర్వాత టీమ్ ఇండియా సూపర్-8కి చేరుకోవడం ఖాయంగా కనిపించింది. అయినప్పటికీ, తన  తన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గెలవకపోయినా 15.2 ఓవర్లలోపే ఆస్ట్రేలియా గెలుపును టీమ్ ఇండియా ఆపాల్సి ఉండేది. ఆస్ట్రేలియాను ఆప్ఘనిస్తాన్ ఓడించడంతో ఈ పరిస్థితి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 205 పరుగులకు ఆలౌటైంది.  ఆస్ట్రేలియాను 15.2 ఓవర్లలో గెలవకుండా నిరోధించడమే కాకుండా, వారిని ఓడించగలిగింది. ప్రపంచ కప్ నుండి ఆస్ట్రేలియాను బయటకు పంపించేంత పని చేసింది. ఇప్పుడు ఆస్ట్రేలియా భవిష్యత్ ఆఫ్ఘన్-బంగ్లాదేశ్ ల మధ్య జరిగే మ్యాచ్ పై ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే.. ఆస్ట్రేలియా ఇంటిముఖం పట్టాల్సిందే. 

ఇంగ్లండ్‌తో..
సూపర్-8లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమ్ ఇండియా గెలిచి గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచింది. అంటే ఇప్పుడు గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడనుంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది.  అయితే, దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌ను ఓడించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది.

పోటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
T20 World Cup Semis:  ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ సెమీఫైనల్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? వరల్డ్‌కప్ షెడ్యూల్ రావడంతో, టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంటే, సూపర్-8 గ్రూప్‌లో స్థానంతో సంబంధం లేకుండా, రెండో సెమీఫైనల్ మాత్రమే ఆడాలని నిర్ణయించారు. ఈ సెమీ ఫైనల్ జూన్ 27న గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

595 రోజుల తర్వాత ప్రతీకారం తీర్చుకునే అవకాశం
ఇప్పుడు సెమీస్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడుతుంది.  కాబట్టి పాత చరిత్ర గురించి మాట్లాడుకుందాం. సరిగ్గా 595 రోజుల తర్వాత ఇంగ్లండ్ పై టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. చివరి T20 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్ మ్యాచ్ 10 నవంబర్ 2022న భారత్ - ఇంగ్లండ్ మధ్య జరిగింది.  అడిలైడ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు 595 రోజుల తర్వాత మళ్ళీ సెమీస్ లో ఇంగ్లాండ్ తో భారత్ తలపడబోతోంది. ఇప్పుడు భారత్ కు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. అందుకోసం రోహిత్ జట్టు జూన్ 27న రంగంలోకి దిగనుంది.

#t20-world-cup-2024 #team-india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe