ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు మరోసారి ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆయనకు మరో ఐదు వారాల పాటు బెయిల్ ను సుప్రీం కోర్టు పొడిగించింది. ఈ నెల 21న సత్యేందర్ జైన్ కు వెన్నుముక సర్జరీ జరిగిందని, ఆయనకు కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీం కోర్టు ధర్మాసనానికి వెల్లడించారు.
పూర్తిగా చదవండి..సత్యేందర్ జైన్ కు మరోసారి ఊరట….!
జైన్ కు బెయిల్ పొడిగింపు విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఈడీ తరఫున అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వెల్లడించారు. దీంతో సత్యేందర్ జైన్ బెయిల్ ను మరో ఐదు వారాల పాటు పొడిగిస్తున్నట్టు జస్టిస్ ఏఎస్ బోపన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం తెలిపింది. ఐదు వారాల తర్వాత తదుపరి విచారణను చేపట్టనున్నట్టు వెల్లడించింది.
Translate this News: