AP : చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా సుమిత్ కుమార్ బాధ్యతలు.! చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా సుమిత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు మధ్య కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు By Jyoshna Sappogula 24 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Chittoor : చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా సుమిత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులను మారుస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న షణ్మోహన్ ని కాకినాడ కలెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. Also Read: ఐదు సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం.. వైసీపీ అవినీతి అక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు..! తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సుమిత్ కుమార్ ను చిత్తూరు జిల్లా కలెక్టర్గా ప్రభుత్వ నియమించింది. నేడు బాధ్యతలు చేపట్టిన సుమిత్ కుమార్ కు జిల్లా యంత్రాంగం , కాణిపాకం ఆలయానికి చెందిన వేదపండితులు సాదర స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు మధ్య కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. Also read: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి ఏం చేశారంటే..? అనంతరం, వివిధ శాఖల జిల్లా అధికారులు రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కు పుష్ప గుచ్చలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. #chittoor-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి