టమాట ధరలకు కళ్లెం వేసేందుకు ఇప్పటికే కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ చర్యల్లో భాగంగా ఆన్ లైన్ లో సబ్సిడీపై టమాట విక్రయాలను మొదలు పెట్టింది. నేటి నుంచి ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్ డీసీ) ప్లాట్ ఫారమ్ ద్వారా టమాటాలు కిలో రూ. 70కే విక్రయిస్తున్నట్టు ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ నేషనల్ కోపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్సీసీఎఫ్)పేర్కొంది.
పూర్తిగా చదవండి..సబ్సిడీపై టమాటలు…. ఆన్ లైన్ లో రూ.70కే…!
దేశంలో ఇటీవల టమాట ధరలు పెరిగాయి. పలు నగరాల్లో టమాట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చాలా నగరాల్లో రూ. 150 నుంచి 200 వరకు ధర పలుకుతోంది. ఈ క్రమంలో ధరలకు కళ్లెం వేసేందుకు టమాటలను సబ్సిడీపై అందించాలని నిర్ణయించింది.
Translate this News: