పుస్తకాలు పట్టించాల్సిన పిల్లల చేత పలుగుపార పట్టించి దినసరి కూలీలుగా మార్చేశారు. చేతులు కాయలు కాసేలా మట్టి పనులు చేయించిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని బాదేపల్లి బాలుర ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. విద్యార్థులను విద్యావంతులుగా మార్చాల్సిన ఉపాధ్యాయులే కూలీలుగా మారుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పాఠశాల ప్రహరీ గోడ కూలిపోవడంతో విద్యార్థులు బయటికి వెళ్తున్నారని కంచె కట్టేందుకు నిర్ణయించారు. అయితే కూలీలను పెట్టి చేయించుకోవాల్సిన పనిని.. ఖర్చు అవుతుందని కక్కుర్తి పడి విద్యార్థుల చేత చేయించారు. దీంతో పిల్లలు పలుగుపార పట్టుకుని పనిచేయడంతో వారి చేతులకు దెబ్బలు తగిలాయి. బాలలు చేత పనిచేయించడం నేరం అని తెలిసినా కూడా ఇలా వెట్టిచాకరి చేయించడంపై పేరెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
పూర్తిగా చదవండి..వారు కూలీలు కాదు.. విద్యార్థులే!
విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు కూలీలుగా మారారు. బుక్స్ పట్టుకోవాల్సిన పిల్లలు పలుగుపార పట్టుకున్నారు. విద్యావంతులుగా మార్చాల్సిన ఉపాధ్యాయులే కూలీ పనులు చేయిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Translate this News: