AP: విద్యా సంవత్సరం ప్రారంభం రోజే.. విద్యార్థుల ఆందోళన..!

అనంతపురం జిల్లాలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. చైతన్య విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని ఏఐఎస్బి విద్యార్థి సంఘం ఆరోపించింది. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

New Update
AP: విద్యా సంవత్సరం ప్రారంభం రోజే.. విద్యార్థుల ఆందోళన..!

Ananthapur: విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అనంతపురం జిల్లాలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. చైతన్య విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని ఏఐఎస్బి విద్యార్థి సంఘం ఆరోపించింది. ఆ సంఘం నేత పృథ్వి మాట్లాడుతూ.. విద్యా సంస్థలు పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేసి ఆ నిర్ణయాలు అమలు  చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా చైతన్య విద్యాసంస్థలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వివిధ కోర్సుల పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు