ప్రధానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఆర్చర్ శీతల్ దేవి

పారిస్ లో జరిగిన పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. వీరు ప్రస్తుతం స్వదేశానికి చేరుకున్నారు. వీరందరినీ ప్రధాని మీద తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆర్చర్ శీతల్ దేవి ఆయనకు తన సంతకం చేసిన జెర్సీన గిఫ్ట్‌గా ఇచ్చింది. 

New Update
modi

 

 

పారాలిపింక్స్‌లో ఎన్నడూ లేని విధంగా భారత అధ్లెట్లు 29 పతకాలతో చితక్కొట్టారు. దేశ చరిత్రలో ఇదొక రికార్డ్. ప్రస్తుతం అథ్లెట్లు అందరూ తిరిగి వెనక్కు వచ్చేశారు. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన భారత క్రీడాకారులను ప్రధాని మోదీ తన అధికార నివాసంలో కలిశారు. వారితో కాసేపు సమావేశమయ్యారు. వారందరితో ముచ్చటించారు. పతకధారులతో పాటూ ఈ సమావేశానికి అర్చర్ శీతల్ దేవి కూడా హాజరయింది. ప్రధాని మోదీ అథ్లెట్లను పేరుపేరునా ప్రశంసించారు. అద్బత ప్రదర్శన ఇచ్చారని కొనియాడారు. 

ఈ సమావేశంలో ఆర్చర్ శీతల్ దేవి ప్రధాని మోదీకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. తన కాలితో సంతకం జెర్సీపై సంతకం చేసి దానిని ఆయకు బహూకరించారు. ప్రధాని కూడా శీతల్‌తో ఆప్యాయంగా మాట్లాడ్డమే కాకుండా...ఆమెనిచ్చిన బహుమతిని ఆప్యాయగా స్వీకరించారు. దీనికి సంబంధించిన వీడియోను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సోఫల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు జావెలిన్ త్రోలో దేశానికి స్వర్ణాన్ని అందించిన నవదీప్‌ సింగ్‌ తో కూడా ప్రధాని మాట్లాడారు. తరువాత నవదీప్ ఇచ్చిన టోపీని తీసుకునేందుకు నేల మీద కూర్చున్నారు. దాంతో పాటూ నవదీప్ తన భుజాల మీద సంతకం చేయాలని కోరగా..నవ్వుతూ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. 

Advertisment
తాజా కథనాలు