బీసీసీఐ, విరాట్ కోహ్లీకి ఛాన్స్ లేకుండా చేసిందిః పాక్ మాజీ కెప్టెన్

మలేషియాలో జరిగిన 2008 U/19 క్రికెట్ ప్రపంచ కప్ లో గెలుపొందిన భారత జట్టుకి విరాట్‌ కొహ్లీ సారథిగా వ్యవహరించాడు. ఫస్ట్-క్లాసు క్రికెట్‌లోఅతను ఢిల్లీజట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరఫున, 2009 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోను ఆడాడు. తాజాగా.. పాక్‌ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్‌ చేసిన కామెంట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

బీసీసీఐ, విరాట్ కోహ్లీకి ఛాన్స్ లేకుండా చేసిందిః పాక్ మాజీ కెప్టెన్
New Update

sports- salman-butt-on-claims-of-virat-kohli-stepping-down-himself-from-test-captaincy

టీమ్‌ఇండియా కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ దిగిపోవడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తనని ఎవరూ తప్పించలేదని, తనకు తానుగా సారథ్య బాధ్యతలను వదిలేసినట్లు రూమర్స్ వచ్చాయి. అప్పటి బీసీసీఐ అధినాయకత్వంపై విభేదాలతోనే టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడని పాక్‌ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్‌ కామెంట్ చేశాడు. కోహ్లీ విజయవంతమైన కెప్టెన్. అయితే, అతడిని ఒక్కో ఫార్మాట్‌ నుంచి తప్పించిన విధానం చర్చనీయాంశమైంది. విరాట్ కోహ్లీనే కెప్టెన్సీని వదిలేశాడు.. ఎవరూ అతడిని తీసేయలేదని చెప్పుకొచ్చాడు. కోహ్లి ఒక మిడిల్ ఆర్డర్ బాట్స్ మన్, ఇతను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా ఆడగలడు. బ్యాట్స్ మన్ కొరకు ఐసీసీ ర్యాంకింగ్ లలో 873 పాయింట్లతో కోహ్లి మొదటి స్థానంలో ఉన్నాడు. కవర్ రీజియన్ మీదుగా అతను కొట్టే షాట్స్ కు అతను ప్రసిద్ధి చెందాడు.

అతను రైట్ ఆర్మ్ మీడియం పేస్ లో కూడా బౌలింగ్ చేయగలడు. కోహ్లీ 2014-15లో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోనీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగడంతో భారత టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఆయన 15 జనవరి 2022న టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు.తన తండ్రి మరణించిన రోజు కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ఢిల్లీ తరఫున ఆడినప్పుడు కోహ్లి మొదటిసారి వెలుగులోకి వచ్చాడు. అతని కుటుంబానికి అతని అవసరం బాగా ఉన్న కీలక క్షణములలోనే అతని జట్టులోని వారికి కూడా అతని అవసరం వచ్చింది. కానీ అతను తను బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పి 90 పరుగులు చేసాడు. ఇది క్రికెట్ పట్ల అతనికి ఉన్న నిబద్ధతను చూపిస్తుంది. ఈ మ్యాచ్ ను ఢిల్లీకి అనుగుణంగా మార్చటంలో ఈ ఇన్నింగ్స్ కీలకమైందని చెప్పాలి.

టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ నిష్క్రమణ జరగకుండా ఉంటే బాగుండేది. ప్రొఫెషనల్‌ ఆటగాడైన విరాట్ కెప్టెన్‌గా జట్టుకు అద్భుత విజయాలను అందించాడని సల్మాన్ భట్ చెప్పాడు. విరాట్ కోహ్లీ తర్వాత మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని రోహిత్ శర్మ అందుకున్న విషయం తెలిసిందే. గత పదేళ్లుగా ఐసీసీ కప్‌ను గెలవలేకపోయిన భారత్‌కు రోహిత్ అందిస్తాడేమోనని ఆశలు అభిమానుల్లో కలిగాయి. గతేడాది జరిగిన ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో నిరాశపరిచాడు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ భారత్‌ ఓడిపోయింది. మరోవైపు వ్యక్తిగతంగానూ రోహిత్ ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. ఈ ఏడాదే మళ్లీ ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ వంటి టోర్నీలు జరగబోతున్నాయి. ఈసారైనా ఐసీసీ కప్‌ లోటును తీరుస్తాడేమో చూడాలి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe