Bombay High Court : వీర్యదాత, అండం ఇచ్చిన వారికి బిడ్డ పై హక్కు ఉండదు!

వీర్య, అండ దాతలకు బిడ్డపై చట్టపరమైన హక్కులు ఉండవని బాంబే హైకోర్ట్‌ పేర్కొంది. అంతేకాకుండా వారికి బయోలాజికల్‌ తల్లిదండ్రులుగా కూడా చెప్పుకునే హక్కు ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ మిలింద్ జాదవ్‌‌ మంగళవారం తీర్పు వెలువరించారు.

New Update
Bombay High Court : వీర్యదాత, అండం ఇచ్చిన వారికి బిడ్డ పై హక్కు ఉండదు!

Bombay High Court Says : వీర్య, అండ దాతలకు (Sperm & Egg Donor) బిడ్డపై చట్టపరమైన హక్కులు ఉండవని బాంబే హైకోర్ట్‌ (Bombay High Court) పేర్కొంది. వారిని పిల్లలకు జీవ సంబంధ తల్లిదండ్రులుగా చెప్పకూడదని వివరించింది.. తన కవల కూతుళ్లను చూసేందుకు అనుమతించాలని ఓ మహిళ వేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

తన పిల్లలు అద్దె గర్భం (Surrogacy) ద్వారా పుట్టారని.. వారు తన భర్త, సోదరితో కలిసి ఉంటున్నారని పిటిషనర్‌ కోర్టుకు తెలియజేసింది. తన సోదరే తనకు అండం దానం చేసిందని.. అయితే ఆమెకే పిల్లలపై చట్టబద్ధ హక్కు ఉంటుందని తన భర్త ఆమెతో వాదిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. భర్త వాదనను కోర్టు తోసిపుచ్చింది.

విభేదాల కారణంగా 2021లో పిటిషనర్‌ భర్త ఇద్దరు పిల్లలను తీసుకుని వేరే ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ పిల్లల బాగోగులను పిటిషనర్‌ సోదరి చూసుకుంటుందని సదరు భర్త తెలియజేయడంతో ఆమె స్థానిక కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆమె అభ్యర్థన తిరస్కరణకు గురి కావడంతో హైకోర్టులో కేసు వేశారు.

Also Read: రేపే రూ.2 లక్షల రుణమాఫీ!.. టింగ్ టింగ్ మని మోగనున్న ఫోన్లు

Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Kerala: 270 ఏళ్ళ తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకమ్

270 ఏళ్ళ తర్వాత కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకమ్ నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగిన ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో గర్భగుడి శిఖరంపై మూడు కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం విశ్వక్సేనుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు.

New Update
kerala

Padmanabha swamy temple

 కేరళలో అనంతపద్మనాభి స్వామి దేశాలయం ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఈ గుడి వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అందుకే 270 ఏళ్ళుగా దీన్ని మూసేశారు. అయితే రీసెంట్ గా ఆ ఆలయాన్ని మళ్ళీ తెరిచారు. దాంతో పాటూ 270 ఏళ్ళ తర్వాత అనంత పద్మనాభ స్వామి ఈరోజు మహాకుంభాభిషేకమ్ నిర్వహించారు. దీనిలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో గర్భగుడి శిఖరంపై మూడు కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం విశ్వక్సేనుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఈ విగ్రహం కూడా 300 ఏళ్ళ నాటిది. కటు సర్కార యోగం అనే పద్ధతిలో దీన్ని తయారు చేశారని చెబుతున్నారు.  ప్రధాన ఆలయ ఆవరణలోని తిరువంబడి శ్రీ కృష్ణ ఆలయం వద్ద అష్టబంధ కలశాన్ని ఉంచారు. 

ట్రావెన్ కోర్ కుటుంబం ప్రత్యేక పూజలు..

అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని కేరళలోని ట్రావెన్ కోర్ సంస్థానం చూస్తుంది. అందుకే కుంభాషేకం ముందు ఈ వంశానికి చెందిన మూలమ్ తిరునాల్ రామ వర్మ కుటుంబానికి చెందిన సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్‌ విశ్వనాథ్‌ రాజేంద్ర అలేఖర్‌ కూడా హాజరయ్యారు. ఆలయం పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశిస్తూ 2017లో సుప్రీం కోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచే ఆలయ బాగోగుల పనులు మొదలైనప్పటికీ కోవిడ్ కారణంగా అవి ఆగిపోయాయి. కోవిడ్ అనంతరం దశలు దశలుగా పని చేస్తూ ఇప్పటికి పూర్తి చేశారు. 

Also Read :  అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు

Advertisment
Advertisment