AP SKILL DEVELOPMENT SCAM CASE: ఏపీ స్కిల్ స్కామ్ సెగ పార్లమెంట్ని తాకింది. టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అక్రమమని టీడీపీ వాదించింది. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని టీడీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తారు. చంద్రబాబు అరెస్ట్పై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని.. ఈ అరెస్ట్ చెల్లదంటూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్(Galla jayadev) విమర్శించారు. అయితే గల్లా మాటలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అన్ని ఆధారాలు ఉండడంతోనే చంద్రబాబు అరెస్ట్ అయ్యారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Mithun reddy) రివర్స్ అటాక్ చేశారు. 80 షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందని ఈడీ తేల్చిన విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు మిథున్రెడ్డి. ఇది పూర్తిగా అవినీతి కేసు అని, ఐటీ శాఖ చంద్రబాబు పీఏకు నోటీసులు ఇచ్చిందన్నారు. అయితే ఆయన పరారీలో ఉన్నారన్నారు మిథున్ రెడ్డి. సీఐడీ చీఫ్ సంజయ్ చెప్పిన విషయాలను మిథున్రెడ్డి పార్లమెంట్లో చెప్పారు. చంద్రబాబు రూలింగ్లో ఉండగానే స్కిల్ స్కామ్ జరిగిందన్నారు.
పూర్తిగా చదవండి..TDP VS YCP: పార్లమెంట్లో స్కిల్ స్కామ్ లొల్లి.. తిట్టుకున్న వైసీపీ, టీడీపీ ఎంపీలు!
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై పార్లమెంట్లో రచ్చ జరిగింది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు పార్లమెంట్లో వాగ్వాదానికి దిగారు. సభకు నల్ల బ్యాడ్జీలతో వచ్చిన టీడీపీ ఎంపీలు చంద్రబాబు అరెస్ట్ అక్రమమని వాదించారు. దీనిపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 80 షెల్ కంపెనీలకు డబ్బు వెళ్లిందని ఈడీ తేల్చిన విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు మిథున్రెడ్డి.
Translate this News: