AP Violences: రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండపై రెండ్రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. ఆదివారం అర్థరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీకి అందించారు.
పూర్తిగా చదవండి..AP: ఏపీ అలర్లు..150 పేజీలతో ప్రాథమిక నివేదిక.. 33 కేసులు, 1370 మంది నిందితులు..!
ఏపీ అల్లర్లపై డీజీపీ హరీష్కుమార్ గుప్తాకు సిట్ నివేదిక అందించింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ 150 పేజీల ప్రాథమిక నివేదికను అందజేశారు. హింసాత్మక ఘటనలపై రెండురోజులపాటు ఆరా తీశారు. మరోవైపు అల్లర్లపై పారదర్శకంగా విచారణ చేయాలని సిట్ చీఫ్ ను కలిశారు వైసీపీ నేతల బృందం.
Translate this News: