Harish rao: 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్‌.. మంత్రి హరీశ్‌రావు వరాల జల్లు!

ప్రాథమిక చికిత్స నుంచి ప్రాణాంతక వ్యాధుల వరకు అన్ని వైద్య సేవలు అందిస్తున్నమని చెప్పారు హరీశ్‌రావు. ఒకప్పుడు మనం నీళ్లు చూడనోళ్లం..కానీ ఇప్పుడు కరువు ఎరగనోల్లమని చెప్పుకొచ్చారు. సిద్దిపేట జిల్లా చేసుకున్నామని.. సిద్దిపేటకు గోదావరి నీళ్లు తెచ్చుకున్నామని.., సిద్దిపేట కి రైల్ కూడా తెచ్చుకున్నామన్నారు హరీశ్‌రావు. ఒక ప్రాంతానికి కావాలిసిన కలలను సాకారం చేసుకున్నామని చెప్పామన్నారు. వేయి పడకల ఆస్పత్రి మనకు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

New Update
Harish rao: 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్‌.. మంత్రి హరీశ్‌రావు వరాల జల్లు!

సిద్దిపేటలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నూతనంగా నిర్మించిన 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ రఘుతం రెడ్డి, సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, అడిషనల్ కలెక్టర్ గిరిమ అగర్వాల్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

హరీశ్‌రావు ఏం అన్నారంటే?

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నిర్మించడం వల్ల కార్మికుల పిల్లలు, పేద పిల్లలు ఈరోజు డాక్టర్లుగా తయారవుతున్నారన్నారు హరీశ్‌రావు. 175 సీట్లు సిద్దిపేట మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు పొందుతారు. ఇందులో 25శాతం అంటే 25 సీట్లు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి చదువుతున్న వారున్నారు. ఢిల్లీ రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఏంటో అర్థం అవుతుందన్నారు హరీశ్‌రావు. గతంలో సిద్దిపేట మెడికల్ కాలేజ్ నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి పంపించేవారు కానీ ఇకపై నుండి ఇక్కడే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయి.

ప్రైవేట్ కి ధీటుగా:
కొత్త క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఇకనుంచి క్యాన్సర్ చికిత్స కూడా ఇక్కడే అందిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ ఆస్పత్రిలో 40 పడకల డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు హరీశ్‌రావు. 15 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందులో 8 మార్జిలర్ ఆపరేషన్ థియేటర్లు నిర్మించుకున్నామన్నారు. 100 ఐసీయూ బెడ్‌లు పూర్తి సామర్ధ్యంతో సేవలు ఇస్తున్నామన్నారు. ప్రైవేట్‌కి దీటుగా వైద్య సేవలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఇస్తున్నట్టు చెప్పారు. 30 పడకలతో ఎమర్జెన్సీ వార్డు ఏర్పాటు చేశామని.. 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు హరీశ్‌రావు. 875 మంది వైద్య విద్యార్థులు ఉంటారని.. 13 డిపార్ట్మెంట్‌లో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో 3 నూతన పీజీ సీట్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి ఏడాది 62 మంది పీజీ విద్యార్థులకు కూడా చదివే అవకాశం ఉందని.. సంపన్నుల పిల్లలే డాక్టర్ చదువు చదవాలన్న నానుడిని మారుస్తూ రైతులు, కూలీల పిల్లలు కూడా ఎంబీబీఎస్ చేసే అవకాశం ఇచ్చింది కేసీఆర్ అని కొనియాడారు. స్టాఫ్ నర్స్‌ల పేరు మారుస్తూ నర్సింగ్ డాక్టర్‌గా పిలుస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు హరీశ్‌రావు. నర్సింగ్, బి ఫార్మసీ కాలేజీలు సిద్దిపేటలో ఉన్నాయని చెప్పారు. 280 మంది డాక్టర్ లు 24 గంటలు సేవలు అందిస్తారన్నారు. వీరితోపాటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న 150 మంది డాక్టర్లు కూడా సేవలు అందిస్తారని తెలిపారు.

ALSO READ: ఆ చిట్‌ కంపెనీల్లో నోట్ల కట్టలు.. ఐటీ దాడుల్లో సంచలనాలు..!

CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL

Advertisment
తాజా కథనాలు