Sharmila: అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు.. కేంద్రంపై షర్మిల విమర్శలు..!

విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ లేదని బతికించారా లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా..? అంటూ కేంద్రంపై APCC చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోదీ.. ఆంధ్రుల తలమానికం విశాఖ ఉక్కుపై డబుల్ గేమ్ ఆడుతున్నారన్నారు.

New Update
YS Sharmila: 'మీ నీచ రాజకీయాలు' అంటూ ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్

Sharmila:  విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ లేదని బతికించారా లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా..? అంటూ  APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరు.. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అనే సామెతలా ఉందన్నారు. 6 వేల కోట్ల అప్పుల్లో ఉన్నామని, ఉక్కు తయారీకి ఇక ముడిపదార్థాలు నిండకున్నాయని, కొనేందుకు చిల్లిగవ్వ కూడా లేదని, ఈ నెల జీతాలు కూడా ఇవ్వడం కష్టమే అంటూ యాజమాన్యం చేతులెత్తేస్తుంటే మోదీకి కనీసం చీమ కుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. పోనీ అప్పు తెద్దామా అంటే గ్యారెంటీకి కూడా కనికరం లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోదీ.. ఆంధ్రుల తలమానికం విశాఖ ఉక్కుపై డబుల్ గేమ్ ఆడుతున్నారన్నారు. లేదు లేదు అంటూనే ఆయన దోస్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారన్నారు. విశాఖ స్టీల్ కు రూపాయి సహాయం చేయకుండా వెంటిలేటర్ మీదకు నెట్టారన్నారు. నిధులు ఇవ్వకుండా సైలెంట్ గా నిర్వీర్యం చేస్తున్నారని.. త్వరలోనే అదానీ, అంబానీ, జిందాల్ లాంటి వాళ్లకు కట్టబెట్టే ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని షర్మిల అన్నారు.

ఏపీ బీజేపీ నేతలను, కూటమిలో భాగస్వామ్యం అయిన టీడీపీ, జనసేన పార్టీలను హెచ్చరిస్తున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేకుంటే.. ప్లాంట్ బలోపేతంపై మీకు చిత్తశుద్ధి ఉంటే.. తక్షణం ఆర్థిక సహాయం ప్రకటన చేయాలన్నారు. కావాల్సిన ముడిపదార్థాలు వెంటనే సమకూర్చాలని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్లాంట్ కు పూర్వవైభవం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.

Advertisment
తాజా కథనాలు