/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/road-accident-jpg.webp)
Horrific road accident in Bihar : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోహతాస్ జిల్లా శివసాగర్లోని పఖ్నారి సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా కైమూర్లోని కుడారి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరంతా ...జార్ఖండ్లోని రాంచీ నుండి తమ గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి గల కారణమని పోలీసులు తెలిపారు. అతివేగంతో వెళ్తున్న స్కార్పియో డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడంతో...హైవేపై ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది. స్కార్పియో వాహనంలో మొత్తం 12 మంది ఉన్నారు. వారిలో 7గురు అక్కడిక్కడే మరణించారు.
ఇది కూడా చదవండి : రైల్వేలో 2409 ఖాళీలకు నోటిఫికేషన్…పది పాసైతే చాలు..వెంటనే అప్లయ్ చేసుకోండి..!!
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై అతివేగంతో వస్తున్న స్కార్పియో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా కైమూర్ జిల్లాలోని సవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుడారి గ్రామ వాసులు.
వాహనంలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వారిని సదర్ ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం ప్రకారం, స్కార్పియోలో ఉన్న వారందరూ బోద్గయా నుండి కైమూర్కు తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. మృతులు, క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి : భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..నేటి నుంచి అమల్లోకి..!!