CM Jagan Attack Case: జగన్‌ను హత్య చేసేందుకే ప్లాన్.. పోలీసుల సంచలన రిపోర్ట్

AP: సీఎం జగన్‌పై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జగన్‌ను హత్య చేసేందుకే పదునైన రాయితో సతీష్ దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా సతీష్‌ను గుర్తించినట్టు పేర్కొన్నారు.

CM Jagan Attack Case: జగన్‌ను హత్య చేసేందుకే ప్లాన్.. పోలీసుల సంచలన రిపోర్ట్
New Update

CM Jagan Attack Case: సీఎం జగన్‌పై దాడి కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జగన్‌ను హత్య చేసేందుకే పదునైన రాయితో సతీష్ దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

రిమాండ్ రిపోర్టులో ఏముందంటే..

* ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నాము.

* కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడు కదలికలు ఉన్నట్లు నిర్ధారించాయి

* మాకు వచ్చిన సమాచారం మేరకు అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేశాము

* 17వ తేదిన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి మొబైల్ ఫోన్ సీజ్ చేశాము

* నిందితుడు కేసులో A2 ప్రోద్బలంతో దాడికి పాల్పడినట్లు గుర్తించాము

* వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు పదునైన రాయితో దాడి చేశాడు

* దాడి వెనుక సీఎం ను చంపాలని ఉద్దేశ్యం ఉంది

* అదును చూసి సిఎం జగన్ సున్నితమైన తల భాగంలో దాడి చేశాడు

* 8 గంటల 4 నిమిషాల సమయంలో ప్రజలతో కలిసి బస్సు యాత్రలో ఉన్నాడు

* దాడి చేయడానికి సిమెంట్ కాంక్రీట్ రాయి తీసుకొని వచ్చాడు

Also Read: వివేకా హత్య కేసుపై కోర్టు సంచలన ఆదేశాలు

#cm-jagan-attack-case
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe