హైకోర్టు సంచలన తీర్పు..తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తే ఆస్తి వెనక్కి...!!

తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకుని పిల్లలకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తల్లిందడ్రులు ఆస్తిని ఇచ్చిన తర్వాత..తమ పిల్లలు పట్టించుకోకపోతే..వారిపై ఉన్న ఆస్తిని లేదా వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది

New Update
హైకోర్టు సంచలన తీర్పు..తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తే ఆస్తి వెనక్కి...!!

తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకుని పిల్లలకు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తల్లిందడ్రులు ఆస్తిని ఇచ్చిన తర్వాత..తమ పిల్లలు పట్టించుకోకపోతే..వారిపై ఉన్న ఆస్తిని లేదా వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. తల్లిదండ్రులు తమ పిల్లలు తమ బాగోగులు చూసుకోవడం లేదని భావిస్తే పిల్లల పేరు మీదున్న ఆస్తులను ఏకపక్షం చేయవచ్చని కోర్టు పేర్కొంది. తల్లిదండ్రుల ఇష్టం ప్రకారం..వారి ఆస్తిని వారి ఇష్టం ప్రకారం మార్చుకోవచ్చని తెలిపింది. తమపై నిర్లక్ష్యంగా వ్యవహరించే బిడ్డల నుంచి తన ఆస్తి నుంచి విడదీయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

పిల్లలు వారి తల్లిదండ్రులకు ఆహారం, ఆశ్రయం కల్పించడమే కాకుండా వారు సురక్షితంగా, గౌరవంగా సాధారణ జీవితాన్ని గడపాలని నిర్దారించడం పిల్లల బాధ్యత అని ధర్మాసనం పేర్కొంది. తిరుపూర్ ఆర్డిఓ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థిస్తూ ఓ మహిళకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తల్లిదండ్రులను కాపాడుకోవల్సిన బాధ్యత, అలాంటి తల్లిదండ్రులను అవసరాలకు కూడా సాధారణ జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులను కాపాడుకోవడం పిల్లల బాధ్యత అని కోర్టు పేర్కొంది.

ఇది కూడా చదవండి: బంగాళాఖాతంలో బలమైన భూకంపం, సునామీ వస్తుందా?

సీనియర్ సిటిజన్ల ప్రాణాలకు, గౌరవానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వంలోని అధికారులు భావిస్తున్నారని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం...అలాంటి పౌరుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడం జిల్లా కలెక్టర్ విధి అని జడ్జి తెలిపారు. న్యాయస్థానం ఒక సీనియర్ సిటిజన్ దాఖలు చేసిన ఫిర్యాదును తేలికగా తీసుకోలేమన్నారు. సీనియర్ సిటిజన్ల గౌరవాన్ని కాపాడేందుకు భద్రతను కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్.. టీడీపీ నేతలు హౌస్‌ అరెస్ట్

తమిళనాడులోని తిరుపూర్ లో నివాసం ఉంటున్న షకీరా బేగం తన కుమారుడు మహమ్మద్ దయాన్ పేరుమీద కొంత ఆస్తిని రాసింది. అయితే కుమారుడు తన బాగోగులను పట్టించుకోవడం లేదని షకీరా బేగం సబ్ రిజిస్ట్రార్ ను ఆశ్రయించింది. తనను బాగా చూసుకుంటాడన్న నమ్మకంతో తన పేరుమీదున్న ఆస్తిని తన కుమారుడికి ఇచ్చానని చెప్పింది.

ఇప్పుడు తన కొడుకు చేసి తనకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని తాను రాసిన్ సెటిల్ మెంట్ డీడ్ ను రద్దు చేయాలని కోరింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ ఈ డిడ్ రద్దు చేశారు. ఆ నిర్ణయాన్ని ఆమె కొడుకు మహ్మద్ దయాన్ సవాల్ చేశారు. తన తల్లి సెటిల్ మెంట్ డీడ్ ను ఎలాంటి షరతులు లేకుండా రాసినట్లు తెలిపారు. కానీ దయాన్ వాదనలు కోర్టు తోసిపుచ్చింది. బాధిత తల్లిదండ్రులు ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది.

ఇది కూడా చదవండి: కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక లోపం..తప్పిన పెను ప్రమాదం..!!

Advertisment
తాజా కథనాలు