AP: ఏపీకి ఆమె లేడీ విలన్.. బతుకంతా దానికోసమే: పోసాని కాంట్రవర్సీ కామెంట్స్! సినీ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె పని చేసేది బీజేపీ కోసం కాదని.. టీడీపీ, చంద్రబాబుకు కోసం కష్టపడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీకి ఆమె లేడీ విలన్ అన్నారు. By srinivas 10 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Posani Muralikrishna: ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె పని చేసేది బీజేపీ కోసం కాదని.. టీడీపీ, చంద్రబాబుకు కోసం కష్టపడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు బుధవారం మీడియతో మాట్లాడిన ఆయన పురందేశ్వరిపై తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. ఇది కూడా చదవండి: Ram Mohan Reddy : నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా.. నీ భాగోతం బయటపెడతా : హరీష్ రావుకు వార్నింగ్! జీవితమంతా స్టేజీల మీద.. పోసాని మాట్లాడుతూ.. పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేడీ విలన్ అన్నారు. ఆమె కష్టమంతా చంద్రబాబును గద్దెనెక్కించేందుకునేనని, టీడీపీ మేలు కోసమే పురంధేశ్వరి కష్టపడుతున్నారన్నారు. బీజేపీలో ఉన్నప్పటికీ ఆమె ప్రయత్నమంతా చంద్రబాబును గెలిపించడమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించమని ఇప్పుడు ఇస్తోన్న రూ.5 వేల వేతనం కాకుండా రూ.10 వేలు ఇస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇచ్చిన హామీపైన పోసాని స్పందించారు. చంద్రబాబు చెప్పే మాటలను వాలంటీర్లు నమ్మరన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు జీవితమంతా స్టేజీల మీదనే బతుకుతున్నారంటూ ఎగతాళి చేశారు. #posani-muralikrishna #daggubati-purandeshwari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి