Breaking : కాంగ్రెస్ టికెట్లపై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన వాఖ్యలు చేశారు. టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం జరగలేదని, బయట నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు.

New Update
Breaking : కాంగ్రెస్ టికెట్లపై రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రేణుకా చౌదరి. టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం జరగలేదని, బయట నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. మొదటి జాబితాపై అసంతృప్తితో ఉన్నారు. డబ్బున్న వాళ్లకు కాదు, దమ్మున్నవారికి టికెట్లు ఇవ్వాలని రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని..కమ్మ కులాన్ని కూడా గుర్తించాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాజకీయ పరిణామాల కారణంగా కమ్మ కులస్తులు ఉద్రేకంగా ఉన్నారన్నారు. కమ్మ కులస్తుల మనోభావాల్ని పరిగణలో తీసుకోవాలని అధిష్టానాన్ని కోరినట్లు రేణుకా చౌదరి తెలిపారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబు బెయిల్ పై విచారణ.. నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి

కమ్మలకు టికెట్లు ఇవ్వడమంటే పిల్లికి బిక్షం పెట్టినట్లు కాదన్నారు. ఓడిపోయే నియోజకవర్గాలు ఇస్తాం అంటే ఎలా కుదురుతుందని ఫైర్ అయ్యారు. కమ్మలను తక్కువగా అంచనా వేయోద్దన్నారు. అలా చేస్తే తగిన పరిణామాలు ఉంటాయని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని రేణుకా చౌదరి అన్నారు. మా సీట్లు మాకు ఇస్తేనే మా వర్గం ఓట్లు కాంగ్రెస్ కు వస్తాయని బహిరంగంగానే చెప్పారు. అంతేకాదు ఇతర పార్టీలు పిలిచి మరీ తమకు సీట్లు ఇస్తామంటున్నాయని ఈ సందర్భంగా రేణుకా చౌదరి అన్నారు.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే ఉప్పు కలిపిన నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుస్తే షాక్ అవుతారు..!!

Advertisment
తాజా కథనాలు