కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…సుడిగాలి పర్యటనలు చేస్తుంటారు. ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతారో ఎవరికీ అంతుపట్టదు. ఒకసారి లారీలో ప్రయాణం చేస్తే…మరోసారి జొమాటో డెలివరీ బాయ్ తో కలిసి చక్కర్లు కొడుతాడు. ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ…ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ దేశ ప్రజలకు చేరువయ్యారు. ఒక సామాన్య పౌరుడిలా ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇఫ్పుడు తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న సోనేపట్ కు వెళ్లారు. అక్కడ రైతులతో కలిసి ముచ్చటించారు. అంతేకాదు ట్రాక్టర్ తో పొలం దుక్కి దున్నారు.
పూర్తిగా చదవండి..కాదేదీ రాహుల్కు అనర్హం, ట్రాక్టర్ నడిపి..వరి నాటేసిన కాంగ్రెస్ సీనియర్ నేత..!!
కాంగ్రెస్ సీనియర్ నేత.. రాహుల్ గాంధీ శనివారం ఉదయం అకస్మాత్తుగా ఢిల్లీకి ఆనుకుని ఉన్న సోనేపట్కు చేరుకున్నారు. అక్కడ పొలాల్లో పని చేస్తున్న రైతులతో ముచ్చటించారు. అంతేకాదు పొలంలో ట్రాక్టర్ దున్నాడు. గోహనాలోని బరోడా ప్రాంతానికి వచ్చిన రాహుల్ గాంధీ పొలాల్లో వరి నాట్లు వేస్తూ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Translate this News: