జమ్మూకశ్మీర్లో సైన్యం, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి మన సరిహద్దులోకి చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులు కుప్వారాలోని మాచల్ సెక్టార్లోని కాలా జంగిల్లో హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. మరోవైపు, మూడు రోజుల క్రితం కూడా కుప్వారా జిల్లాలోనే భద్రతా బలగాలు 5 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఉగ్రవాదులంతా పాకిస్థాన్ నివాసితులని పేర్కొన్నారు.
అంతకుముందు బహరాబాద్ హాజిన్లో లష్కరే తోయిబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని వద్ద నుంచి రెండు చైనా హ్యాండ్ గ్రెనేడ్లను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్ను బండిపొర పోలీసులు, 13 RR, CRPF 45BN బెటాలియన్ సంయుక్తంగా అమలు చేశారు. ఈ కేసులో ఉగ్రవాదిపై ఆయుధాల చట్టం మరియు యుఎ (పి) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.