Lok Sabha: లోక్ సభలో భద్రతా వైఫల్యం.. టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు..అసలేమైందంటే?

లోక్ సభలో భద్రత వైఫల్యం చోటుచేసుకుంది. లోక్ సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు ఆగంతుకులు చొరబడ్డారు. వారు టియర్ గ్యాస్ వదలడంతో భయంతో ఎంపీలు బయటకు పరుగులు తీశారు. కాగా, 2001 లో ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరిగింది. ఈ అనూహ్య పరిణామంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

Lok Sabha: లోక్ సభలో భద్రతా వైఫల్యం.. టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు..అసలేమైందంటే?
New Update

Lok Sabha Attack: పార్లమెంట్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇద్దరు ఆగంతుకులు లోక్ సభలోకి చొరబడ్డారు. సభలో టియర్ గ్యాస్ వదలడంతో భయపడిన ఎంపీలు వెంటనే బయటకు పరుగులు తీశారు. జీరో అవర్ లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు మహిళ ఉన్నారు.

లోక్ సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభ్యుల మధ్యలోకి దూకి ముందుకు దూసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. కాగా, 2001 లో ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరిగింది. ఈ దాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజు ఆగంతుకులు లోక్ సభలో చొరబడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

యువకుడు లోక్ సభలోకి చొరబడి ఎంపీలపై టియర్ గ్యాస్ వదలడం వీడియోలో కనిపిస్తోంది. దుండగుల వద్ద ఆయుధాలు కూడా ఉండి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత భద్రత ఉండే పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడమే కష్టం కాగా.. ఈ దుండగులు ఇద్దరు పార్లమెంట్ లోపలికి ప్రవేశించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. లోక్ సభ సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనూహ్య పరిణామంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

#lok-sabha-attack
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి