/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/gas-1-jpg.webp)
Lok Sabha Attack: పార్లమెంట్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇద్దరు ఆగంతుకులు లోక్ సభలోకి చొరబడ్డారు. సభలో టియర్ గ్యాస్ వదలడంతో భయపడిన ఎంపీలు వెంటనే బయటకు పరుగులు తీశారు. జీరో అవర్ లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు మహిళ ఉన్నారు.
संसद भवन के बाहर 2 लोगों ने प्रदर्शन के दौरान कुछ कलर बम्ब चलाया। संसद के सामने नारे लगाते हुए पुलिस ने हिरासत में लिया। इनमें एक महिला भी शामिल#ParliamentAttack#Loksabhapic.twitter.com/qMqynBIXVR
— Arjun Chaudharyy (@Arjunpchaudhary) December 13, 2023
లోక్ సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభ్యుల మధ్యలోకి దూకి ముందుకు దూసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. కాగా, 2001 లో ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరిగింది. ఈ దాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజు ఆగంతుకులు లోక్ సభలో చొరబడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యువకుడు లోక్ సభలోకి చొరబడి ఎంపీలపై టియర్ గ్యాస్ వదలడం వీడియోలో కనిపిస్తోంది. దుండగుల వద్ద ఆయుధాలు కూడా ఉండి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత భద్రత ఉండే పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడమే కష్టం కాగా.. ఈ దుండగులు ఇద్దరు పార్లమెంట్ లోపలికి ప్రవేశించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. లోక్ సభ సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనూహ్య పరిణామంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
लोकसभा की सुरक्षा में बड़ी चूक, सदन की कार्यवाही में एक शख्स घुसा #LokSabhapic.twitter.com/wCe5VslUnB
— Nikhil Tyagi (@NikhilT37865100) December 13, 2023