హర్యానాలోని నుహ్లో సోమవారం జరిగిన హింసాకాండ తర్వాత జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 44 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పుకార్లు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నూహ్లో నేటికీ ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగనుంది. హర్యానాలోని నుహ్, సోహ్నాలో హింసాకాండ తర్వాత ఉద్రిక్తత కొనసాగుతోంది. మంగళవారం రాత్రి, గురుగ్రామ్లోని సెక్టార్ 70-Aలో మూడు చోట్లా షాపులకు నిప్పు పెట్టారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
పూర్తిగా చదవండి..హర్యానాలో చల్లారని పరిస్థితులు.. కొనసాగుతోన్న కర్ఫ్యూ.. ఏం జరుగుతుందోనని భయాలు..!!
హర్యానాలోని నుహ్లో చెలరేగిన హింస ఇప్పుడు చుట్టుపక్కల జిల్లాలకు కూడా వ్యాపిస్తోంది. మరోవైపు నుహ్లో కర్ఫ్యూ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Translate this News: