/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/abhishek-benarjee.webp)
పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ ఉద్యోగాల కుంభకోణం కేసులో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఎలాంటి ఉపశమనం లభించలేదు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కలకత్తా హైకోర్టు అభిషేక్పై విచారణకు ఆదేశించింది. అభిషేక్ బెనర్జీ కోరుకుంటే, కేసును రద్దు చేసేందుకు హైకోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈడీ ముందు హాజరయ్యేందుకు నిరాకరణ:
ఈడీ కార్యాలయంలో హాజరుకావడానికి అభిషేక్ బెనర్జీ నిరాకరించడం గమనార్హం . తాను జన్ సంజోగ్ యాత్రలో బిజీగా ఉన్నానని, దీని వల్ల కార్యాలయానికి రాలేనని స్పష్టం చేశారు.
ఈడీకి లేఖ రాసిన అభిషేక్ బెనర్జీ:
ఈ మేరకు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్కు లేఖ కూడా రాశారు. లేఖలో ఆయన 'ప్రస్తుతం నేను కోల్కతాలో లేను. పశ్చిమ బెంగాల్ ప్రజలతో కనెక్ట్ కావడానికి రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ప్రయాణిస్తున్నాను. ఇంకా, రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలు జూలై 8న జరుగుతాయని ప్రకటించినందున, ఎన్నికలకు రెడీ అవుతున్నాను. ఈడీ, సిబిఐీ కోరిన సమాచారం, పత్రాలు చాలా వరకు తగిన ప్రభుత్వ శాఖల వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు తనను విచారించవచ్చని గతంలో ఇచ్చిన ఆదేశాలను రీకాల్ చేయాలని కోరుతూ ఎంపీ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ను కలకత్తా హైకోర్టు కొట్టివేసింది.
ఏప్రిల్ 28న, జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఒక టీవీ న్యూస్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూపై అసంతృప్తి వ్యక్తం చేసిన కొద్ది రోజుల తర్వాత, పశ్చిమ బెంగాల్ స్కూల్ ఉద్యోగాల కుంభకోణం కేసును మరొక న్యాయమూర్తికి అప్పగించాలని కలకత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు కోరింది.