ఘోర రోడ్డు ప్రమాదం, మృతిచెందిన కారు డ్రైవర్‌

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని బైపాస్ రోడ్డు హైవేపై బుధవారం ఉదయం కారు పల్టీ కొట్టింది. ఈ ఘటన సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంన్కెపల్లి చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. దీంతో పాటుగా ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పిడింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఘోర రోడ్డు ప్రమాదం, మృతిచెందిన కారు డ్రైవర్‌
New Update

sangareddy-district-sadashivpet-road-accident-car-driver-dead

జహీరాబాద్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు MH-02c1823 నెంబర్ గల కారు అతివేగం కారణంగానే కారు డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టినట్లు పోలీసులు భావిస్తూ ప్రాథమిక విచారణలో తెలిపారు. ఇదిలా ఉంటే కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ సంఘటన స్థలంలో మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యారు. సంఘటన స్థలంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

వాహనదారులకు పోలీసుల హెచ్చరిక

ఎవరు కూడా అతివేగంతో వెళ్లవద్దని పోలీసులు సూచించారు. రోడ్డు భద్రతాపరంగా ఎన్ని కఠినచర్యలు తీసుకున్నా.. రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని పోలీసులు తెలిపారు. అతివేగాన్ని నిర్మూలించేందుకే స్పీడ్‌ బ్రేకర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా ప్రయాణికులు సైతం రోడ్డు ప్రమాణాలను పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని వాహనదారులకు సూచించారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe