Crime News: దారుణం.. యువకుడి వేధింపులకు యువతి ఆత్మహత్య.! సంగారెడ్డి జిల్లా దోమడుగులో దారుణం చోటుచేసుకుంది. యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. బీ ఫార్మసీ విద్యార్థి తేజస్విని ఇంటి నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Jyoshna Sappogula 09 Aug 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంటి నాలుగో అంతస్తుపై నుంచి బీ ఫార్మసీ విద్యార్థి తేజస్విని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి ఇంటి బిల్డింగ్ పైకి ఎక్కి తేజస్విని ఆత్మహత్యకు యత్నించింది. తలకు తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా యువతి మృతి చెందింది. గుమ్మదిదల మండలం దోమడుగులో ఈ సంఘటన చోటుచేసుకుంది. Also Read: ముద్దు పెడితేనే అటెండెన్స్.. లేడీ టీచర్లతో హెడ్మాస్టర్ చిల్లర వేషాలు.! సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి.. వేధింపులకు పాల్పడుతున్న గంజాయి బ్యాచ్.. అమ్మాయి కుటుంబాన్ని సైతం బెదిరించినట్లు తెలుస్తుంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు గంజాయి బ్యాచ్ వేధింపులు భరించలేక తేజస్విని బలవన్మరణానికి పాల్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ యువకుడిని ఉరితీయాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. #sangareddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి