ప్రాణాలు తోడేస్తున్నారు..ఇసుక అక్రమ రవాణా కారణంగా చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చేసేది నేరం కావడంతో..చట్టం కళ్లుకప్పి తప్పించుకోవాలన్న ఆలోచనతో ట్రాక్టర్ని అడ్డదిడ్డంగా..అడ్డగోలుగా నడపడం.. అడ్డొచ్చిన వారిని ఢీకొట్టి చంపడం తెలంగాణలోని చాలా జిల్లాల్లో సర్వసాధారణమైపోయినట్టుగా కనిపిస్తోంది. అడ్డూఅదుపు లేకుండా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా మరో ముగ్గురు ప్రాణాల్ని బలిగొంది. కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మరణించారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద రాంగ్ రూట్లో వస్తున్న ఇసుక ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. మృతులను శివరాత్రి అంజి (26),శివరాత్రి సంపత్ (18), గుడిపెల్లి అరవింద్ (22)గా గుర్తించారు.
పూర్తిగా చదవండి..Sand Mafia: మూడు ట్రిప్పులు.. ఆరు కాసులు.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఇసుక మాఫియా!
అడ్డూఅదుపు లేకుండా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా ముగ్గురు ప్రాణాల్ని బలిగొన్నాయి. కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మరణించారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద రాంగ్ రూట్లో వస్తున్న ఇసుక ట్రాక్టర్ బైక్ను ఢీ కొట్టింది. దీంతో స్పాట్లో శివరాత్రి అంజి (26),శివరాత్రి సంపత్ (18), గుడిపెల్లి అరవింద్ (22) చనిపోయారు.
Translate this News: