AP Politics: వైసీపి తరపున మళ్ళీ ప్రతి గడపకూ వెళ్తామని వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో తమ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలకు వివరిస్తామని అన్నారు. కోటి 40 లక్షల కుటుంబాలకు నేరుగా ఒకటికి మించిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. సంక్షేమం ద్వారా అభివృద్ధి, సంక్షేమమే అభివృద్ధి అని జగన్(CM Jagan) నిరూపించారని పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమం ఆగలేదని.. ప్రజలకు అండగా నిలవటంలో సీఎం జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదని కొనియాడారు. జీఎస్డీపి చంద్రబాబు(Chandra Babu) హయాంలో 22వ ప్లేసులో ఉండేదని.. జగన్ వచ్చాక మొదటి స్థానానికి వచ్చిందని అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు 34 వేలు ఇస్తే.. జగన్ వచ్చాక 4 లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు.
పూర్తిగా చదవండి..చంద్రబాబు వేల కోట్లు దోచుకున్నారు… సజ్జల ఫైర్!
ఏపీని అభివృద్ధి పేరుతో చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు సజ్జల రామకృష్ణా రెడ్డి. సీఎం జగన్ హయాంలో 4 లక్షల 93 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. జగన్ చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామని తెలిపారు.
Translate this News: