Sai Durga Tej : పీరియాడిక్ మూవీలో సాయి తేజ్.. సెట్ అవుతాడా?

సాయి తేజ్ నెక్స్ట్ మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో ఉండబోతోందట. హనుమాన్ నిర్మాత కె.నిరంజన్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమాని రాకేష్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

New Update
Sai Durga Tej : పీరియాడిక్ మూవీలో సాయి తేజ్.. సెట్ అవుతాడా?

Sai Tej New Movie Update : సుప్రీమ్ హీరో సాయి తేజ్(Sai Tej) గత ఏడాది 'విరూపాక్ష' సినిమాతో భారీ కం బ్యాక్ అందుకున్న విషయం తెలిసిందే. సస్పెన్స్ అండ్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ తర్వాత మావయ్య పవన్ కళ్యాణ్ తో 'బ్రో'(Bro) సినిమాలో నటించాడు.

publive-image

'బ్రో' తర్వాత సాయి తేజ్ నుంచి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఆమధ్య సంపత్ నందితో 'గాంజా శంకర్' అనే సినిమాని అనౌన్స్ చేసినా.. పలు అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ క్రమంలోనే సాయి తేజ్ నెక్స్ట్ చేయబోయే సినిమాపై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో సాయి తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఓ క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది.

publive-image

పీరియాడిక్ మూవీలో సాయి తేజ్

లేటెస్ట్ ఫిలిం నగర్(Film Nagar) టాక్ ప్రకారం.. సాయి తేజ్ నెక్స్ట్ మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో ఉండబోతోందట. హనుమాన్ నిర్మాత కె.నిరంజన్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమాని రాకేష్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. సాయి తేజ్ కేరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూ పొందనున్న ఈ సినిమా 1940 బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

publive-image

కాగా ఇప్పటివరకు సాయి తేజ్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీస్ లో నటించింది లేదు. మొదటి సారి ఈ జోనర్ ని టచ్ చేస్తుండటంతో ఫిలిం సర్కిల్స్ లో ఈ ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది జూలై నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Also Read : మతం మారే ఆలోచనలో అమీర్ ఖాన్.. కారణం?

Advertisment
తాజా కథనాలు