మోరంచపల్లి.. 300 ఇళ్లు..700 మంది జనాభా ఉన్న అందమైన పల్లెటూరు. కానీ మోరంచ వాగు సృష్టించిన బీభత్సానికి మోరంచపల్లి ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. ఊరుకు ఊరు నీట మునిగి..ఇప్పుడే తేరుకుంది. ప్రతి ఇల్లు నీట మునిగింది. సర్వం కోల్పోయిన గ్రామస్తులు కట్టుబట్టలతో రోడ్డుపై ఉన్నారు. ఇప్పుడు నీళ్లు వెళ్లిపోవడంతో మోరంచ వాగు సృష్టించిన భయానక పరిస్థితులు అందరి గుండెలను మెలిపెట్టేస్తున్నాయి. రోడ్డేదో, ఇళ్లేదో తెలియని పరిస్థితి. మొత్తం బురద. ఇంట్లోని వస్తువులన్ని వరదలో కొట్టుకుపోయాయి. నిన్నటి వరకు పచ్చగా కనిపించిన పంటపొలాల్లో ఇసుక మేటలు వేసి ఎడారిని తలపిస్తోంది. ఇళ్లల్లోని ఫ్యాన్లకు సైతం చెత్తె చెదారం పట్టుకుందంటే..వరద ప్రవాహం ఏ స్థాయిలో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటి వరకు పాడి పశువులు, పంట పొలాలతో ఎంతో అందంగా కనిపించిన మోరంచపల్లి… ఇవాళ పశువుల కబేళాలతో హృదయ విదారకరంగా మారింది. ఇళ్ల ముందు కట్టేసిన పశువులు కట్టుమీదనే చనిపోయి ఉండడం అక్కడున్న వారిని కన్నీళ్లు పెట్టిస్తోంది. వరద సమయంలో కట్టు తెంచుకుని పోలేక..నీళ్ల నుంచి తప్పించుకోలేక పశువులు నరకయాతన అనుభవించి ప్రాణాలు కోల్పోయాయి.
పూర్తిగా చదవండి..మరుభూమిని తలపిస్తోన్న మోరంచపల్లి.. వరద బాధితుల కన్నీటిగాథ!
అందమైన పల్లెటూరు అందవిహీనంగా మారిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో ఎటు చూసినా కన్నీటిగాథలే వినిపిస్తున్నాయి. గట్టు తెంచుకుని జంపన్నవాగు ఊళ్ల మీద పడడంతో ఏడుగురు గల్లంతయ్యారు. వందలాది మూగజీవాలు కట్టేసిన చోటే ప్రాణాలు వదిలాయి.
Translate this News: