/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Bhuma-Akhila-Priya-1.jpg)
తనపై కిడ్నాపర్, రౌడీ ఇజం, బ్లాక్ మెయిలర్ అంటూ అనేక ఆరోపణలు చేశారని.. కానీ కార్యకర్తలకు ఆళ్లగడ్డ ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు ఎమ్మెల్యే అఖిల ప్రియ. అందుకే తనను అక్కడి ప్రజలు గెలిపించారన్నారు. ఆర్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను వెల్లడించారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి చనిపోయాక.. ఆయన అనుచరులు ఎవరూ తనకు దూరం కాలేదన్నారు. కేవలం ఏవీ సుబ్బారెడ్డి ఒక్కడే కావాలని తనకు దూరం అయ్యాడన్నారు. ఆళ్లగడ్డలో గొడవలు జరగకూడదన్నదే తన లక్ష్యమన్నారు. ఈ విషయమై చంద్రబాబుతో కూడా చర్చించామన్నారు.
పొత్తుల్లో భాగంగా జనసేన, బీజేపీకి పదవులు ఇవ్వాల్సి రావడంతో తమ లాంటి అనేక మందికి ఈ సారి మంత్రి పదవి రాలేదన్నారు. తమ కోసం పని చేసి హత్యకు గురైన ఏవీ లక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. వారిని న్యాయం జరగడం కోసం పోరాడుతామన్నారు. నంద్యాలలో భూమా కుటుంబం భవిష్యత్ లో తప్పకుండా ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ప్రజల కోసమే తమ కుటుంబం ఉంటుందన్నారు. అఖిల ప్రియ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.