AP: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు..!

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో దొంగలు రెచ్చిపోయారు. ప్రసిద్ధ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం వద్ద ప్రధాన ద్వారం హుండీని పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సిసి కెమెరాలో రికార్డ్ ఆయిన దృశ్యాలు వైరల్ గా మారాయి.

AP: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు..!
New Update

East Godavari: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో దొంగలు రెచ్చిపోయారు. ప్రసిద్ధ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం వద్ద ప్రధాన ద్వారం హుండీని దుండగులు పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. సీతానగరం లోని రాములోరి ఆలయంలో హుండీ అపహారించారు. తెల్లవారుజామున వారు అనుమానంగా సంచరించడంతో స్థానికులు ఒకరిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also Read: అర్ధరాత్రి దొంగలు హల్‌చల్.. వ్యాపార దుకాణాల్లో దొంగతనం చేసేందుకు..

అతని వద్ద ఉన్న 31 వేలు నగదు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వీరిపై సుమారు 10 కేసులు పైగా ఉన్నాయని, ప్రత్యేకంగా ఆలయాల్లో హుండీలను మాత్రమే దొంగిలిస్తారని దర్యాప్తులో తేలిందన్నారు. సిసి కెమెరాలో రికార్డ్ ఆయినా దృశ్యాలు ఆధారంగా ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

#east-godavari
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe