Rice Price Hike: బియ్యం ధరలు మరింత పెరిగే ఛాన్స్.. ఎందుకంటే.. 

ఇప్పటికే బియ్యం ధరలు చుక్కల్లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2023-24 సంవత్సరంలో రైస్ ప్రొడక్షన్ బాగా తగ్గే అవకాశం ఉంది. ఎనిమిదేళ్ల లో ఇలా బియ్యం ఉత్పత్తి తగ్గడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 

New Update
Rice Price Hike: బియ్యం ధరలు మరింత పెరిగే ఛాన్స్.. ఎందుకంటే.. 

Rice Price Hike: విపరీతంగా పెరిగిన బియ్యం ధరలతో ప్రస్తుతం సతమతమవుతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వస్తున్న అంచనాలు రాబోయే కాలంలో బియ్యం ధరలు మరింత అవకాశం ఉండనే ఆందోళనలు పెరుగుతున్నాయి. నిజానికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా చెబుతారు.  అయితే మన దేశంలో బియ్యం ఉత్పత్తి 2023-24 సంవత్సరంలో తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఎనిమిదేళ్లలో ఉత్పత్తి తగ్గడం ఇదే తొలిసారి కావడం చెప్పుకోదగ్గ విషయం. . ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈసారి సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం కారణంగా బియ్యం ఉత్పత్తి తక్కువగా ఉంటుంది.  అయితే, ఇదే సమయంలో గోధుమ ఉత్పత్తి ఏడాది క్రితంతో పోలిస్తే 1.3% పెరుగుతుందని అంచనా.

వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జూన్ నాటికి పంట సంవత్సరంలో వరి ఉత్పత్తి 123.8 మిలియన్ మెట్రిక్ టన్నులకు పడిపోతుందని అంచనా వేసింది.  గోధుమ ఉత్పత్తి ఏడాది క్రితం 110.6 మిలియన్ టన్నుల నుండి 112 మిలియన్ టన్నులకు పెరగవచ్చు. జూలైలో బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై భారత ప్రభుత్వం నిషేధం విధించినందున, ఇక్కడ బియ్యం ఉత్పత్తిపై చాలా దేశాలు దృష్టి సారిస్తున్నాయి. మన దేశంలో బియ్యం ఎగుమతిపై నిషేధం కారణంగా,  ప్రపంచవ్యాప్తంగా ధరలు(Rice Price Hike)పెరిగాయి. 

ఎగుమతులపై నిషేధం పెరుగుతుందనే భయం
బియ్యం ఉత్పత్తి తక్కువగా ఉన్నందున, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆహార ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ధాన్యాల ఎగుమతిపై నిషేధాన్ని పెంచుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. థాయిలాండ్, వియత్నాం, పాకిస్థాన్, మయన్మార్‌తో సహా ఇతర ప్రధాన ఎగుమతి దేశాలలో తక్కువ స్టాక్‌లు ఉన్నందున, ఎగుమతులపై సుదీర్ఘ నిషేధం ఆహార ధరలను మరింత పెంచవచ్చు.

Also Read:  ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశం ముగిసింది.. ఏకాభిప్రాయమే కుదరలేదు!

ఎగుమతులపై పన్ను..
బియ్యం ఎగుమతిపై కఠినంగా కొనసాగిస్తూ, ఆగస్టు నెలలో, బాస్మతి బియ్యం ఎగుమతిపై టన్నుకు $ 1,200 కనీస ఎగుమతి ధరను ప్రభుత్వం విధించింది మరియు సెల బియ్యం లేదా పార్బాయిల్డ్ రైస్ ఎగుమతిపై 20 శాతం పన్ను విధించింది. . అప్పటి నుండి, దీని కంటే తక్కువ ధరకు ఎగుమతి అనుమతించబడదు.

దేశీయంగానూ ప్రభావం..
ఎగుమతులపై నిషేధం విధించినా.. దేశంలో వరి పంటలో తగ్గుదల వలన బియ్యం లభ్యత తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని వారు భావిస్తున్నారు. ఎగుమతులను నిషేధించినా.. దేశీయంగా బియ్యం ధరలను అదుపు చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారొచ్చని వారి అంచనా. ఎన్నికల వరకూ ఎగుమతుల నిషేధం ద్వారా ధరల అదుపు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేయవచ్చు కానీ, ఎన్నికల తరువాత పరిస్థితి అదుపులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వారంటున్నారు. మొత్తమ్మీద పరిస్థితులు చూస్తుంటే, బియ్యం ధరలు చుక్కల్లోకి చేరడం ఖాయంలా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు