Revanth Reddy: కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా.. ఫలితాలపై రేవంత్ రెడ్డి ట్వీట్

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావోద్వేగ స్వరంతో స్పందించారు. కొడంగల్ ప్రజలు ఆత్మగౌరవ పతాకాన్ని ఆకాశమంత ఎత్తున ఎగరేశారని ట్వీట్ చేశారు.

Revanth Reddy: కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా.. ఫలితాలపై రేవంత్ రెడ్డి ట్వీట్
New Update

Revanth Reddy: తెలంగాణ ఎన్నికల ఫలితాలు, కొడంగల్‌ (Kodangal)లో విజయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి భావోద్వేగంతో ట్విట్టర్‌లో సందేశాన్ని అందించారు. కష్టకాలంలో అండగా నిలబడిన ప్రతిఒక్కరికీ అండగా ఉంటానని హామీఇచ్చారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ, కొడంగల్‌ను దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో దుమ్ములేపిన కాంగ్రెస్.. విజయానికి 12 ముఖ్య కారణాలివే

"ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా. ఈ గడ్డ పై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా. దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా నిలబెడతా" అని రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. (Revanth Reddy on Twitter)

#revanth-reddy #telangana-elections-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe