Chandrababu-Revanth Reddy: చంద్రబాబుకు రేవంత్ గిఫ్ట్ గా ఏ బుక్ ఇచ్చారో తెలుసా?

తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. ప్రజాభవన్ కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. చంద్రబాబుకు శాలువా కప్పి సన్మానించారు. కాళోజీ రచించిన నా గొడవ పుస్తకాన్ని చంద్రబాబుకు అందించారు రేవంత్.

New Update
Chandrababu-Revanth Reddy: చంద్రబాబుకు రేవంత్ గిఫ్ట్ గా ఏ బుక్ ఇచ్చారో తెలుసా?

ప్రగతి భవన్ లో తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు అధికారుల బృందానికి ఘన స్వాగతం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు తనకు ఇష్టమైన కాళోజీ రచించిన నా గొడవ పుస్తకాన్ని అందించారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ రేవంత్ రెడ్డి నా గొడవ పుస్తకాన్ని చదివారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఆ సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ పుస్తకాన్నే చంద్రబాబుకు అందించారు రేవంత్ రెడ్డి.

publive-image

Advertisment
తాజా కథనాలు