TSRTC : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ (RTC) బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ, పల్లె వెలుగు బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. రోజుకు లక్షల సంఖ్యలో మహిళలు బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. బస్సుల్లో ఎక్కేందుకు ఎగబడుతున్న మహిళలు డ్రైవర్ సీట్లలోనుంచి వెళ్లి బస్సుల్లో ఎక్కి కూర్చుంటున్నారు. చిన్న చిన్న అవసరాలకోసం కూడా బస్సును వాడుకుంటున్నారు. మరికొంతమంది బ్యూటీ పార్లర్, మార్కెట్ వెళ్లేందుకు కూడా బస్సు ఎక్కి వెళ్తున్న సంఘటనలు తారసపడుతుండటం విశేషం. కాగా ఈ ఎఫెక్ట్ తో పురుషులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులో పురుషులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలే నిండిపోవడంతో టికెట్ కొని గంటల తరబడి ప్రయాణం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మగాళ్లు ఎక్కేందుకు కూడా అవకాశం లేకుండా పోతుంది. దీంతో చాలామంది గవర్నమెంట్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులిచ్చి ఎందుకు నిలబడాలంటూ యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారులు పురుషులకు ప్రత్యేక సీట్ల ఏర్పాటుపై కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..TSRTC: మహిళలకు తెలంగాణ ఆర్టీసీ షాక్.. పురుషులకు ప్రత్యేక సీట్లు!
TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు రిజర్వ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో ఉండే 55 సీట్లలో కనీసం 20 సీట్లు మగాళ్లకు రిజర్వ్ చేసే ఛాన్స్ ఉందని, దీనిపై త్వరలోనే ఆర్టీసీ అధికారులనుంచి ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.
Translate this News: