JEE Mains: జేఈఈ మెయిన్‌ దరఖాస్తుకు రేపే లాస్ట్‌ డేట్..

2024 జనవరి 24న జేఈఈ మెయిన్ తొలివిడత ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈనెల 30వ తేది రాత్రి 9 గంటలకు ముగియనుంది. ఈ పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 8.50 లక్షల మంది విద్యార్థులు అప్లై చేయవచ్చని అధికారులు అంచనావేస్తున్నారు

New Update
JEE Mains: జేఈఈ మెయిన్‌ దరఖాస్తుకు రేపే లాస్ట్‌ డేట్..

JEE Mains Last Date: 2024 జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే జేఈఈ మెయిన్ తొలివిడత ఆన్‌లైన్ పరీక్షలకు దరఖాస్తు గడువును ఈనెల 30వ తేది రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 8.50 లక్షల మంది విద్యార్థులు అప్లై చేయవచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి దాదాపు 1.50 లక్షల మంది దరఖాస్తు చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్ 2023 తొలివిడత పేపర్‌-1కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరికి 8.24 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.

Apply Here

Also Read: భర్త పర్సనల్ విషయాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు.. కర్ణాటక హైకోర్టు

Advertisment
తాజా కథనాలు