Ananthapuram: రాజీనామా చేసి మర్యాద నిలబెట్టుకోండి.. వైసీపీ ఎంపీపీపై తిరుగుబాటు..!

అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం వైసీపీ ఎంపీపీ పద్మ చంద్రశేఖర్ రెడ్డిపై తిరుగుబాటు మొదలైంది. తక్షణమే ఆయనను భర్తరఫ్ చేయాలని అదే పార్టీకి చెందిన ఎంపీటీసీలు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీపీ ఆగడాలకు అంతులేకుండా పోయిందని పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

New Update
Ananthapuram: రాజీనామా చేసి మర్యాద నిలబెట్టుకోండి.. వైసీపీ ఎంపీపీపై తిరుగుబాటు..!

Ananthapuram: అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం వైసీపీ ఎంపీపీ పద్మ చంద్రశేఖర్ రెడ్డిపై ఆ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. తక్షణమే ఆయనను భర్తరఫ్ చేయాలని బొమ్మనహల్ మండలం వైసీపీ ఎంపీటీసీలు తిరగబడ్డారు. ఎంపీపీ పద్మా చంద్రశేఖర్ రెడ్డి అక్రమ ఆగడాలకు అంతులేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. వైసీపీకి చెడ్డ పేరు తెచ్చేలా ఆయన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎంపీపీ పద్మా చంద్రశేఖర్ రెడ్డి తనకు తానే రాజీనామా చేసి అధికార పార్టీ వైసీపీ మర్యాద నిలబెట్టుకోవాలని కోరారు.

Also Read: బుద్ధిలేని హీనులే ఇలా చేస్తారు.. జగన్ కు మోహన్ బాబు కౌంటర్

లేనిపక్షంలో ఎంపీపీకి మద్దతు ఉపసంహరించుకుంటామని డిమాండ్ చేశారు. ఎంపీపీగా పద్మా చంద్రశేఖర్ రెడ్డి  బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటుతున్నా అభివృద్ధి చేయడం లేదని మండిపడ్డారు. మండల పరిషత్తు నిధుల నుంచి తమ గ్రామాల్లో అబివృద్ధి పనులకు నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది? రానున్న ఎన్నికల్లో ఏం డెవలప్ చేశారని ప్రజలు అడిగితే ఏమి సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి, వైసీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయ కర్త మెట్టు గోవిందరెడ్డికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు.

Also Read:  అక్కడికి రాముడొక్కడే కాదు.. వేలాది కోట్ల పెట్టుబడులు కూడా 

Advertisment
తాజా కథనాలు