విద్వేషపూరిత ప్రసంగాల కేసులో ఎస్పీ నేత ఆజం ఖాన్ను కోర్టు దోషిగా తేల్చింది. కోర్టు ఆజం ఖాన్కు రెండేళ్ల జైలు శిక్ష, రెండున్నర వేల రూపాయల జరిమానా విధించింది. శిక్షపై ఆజం ఖాన్ తరపు న్యాయవాది, ప్రాసిక్యూషన్ తరఫు వాదనలు వినిపించారు. ఆజం ఖాన్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
పూర్తిగా చదవండి..ఆజంఖాన్కు షాక్.. రెండేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా..!!
విద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్వాదీ పార్టీ నేత ఆజంఖాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను దోషిగా కోర్టు తీర్పు వెలువరించింది. రెండేళ్ల జైలు శిక్షతోపాటు 2,500రూపాయల జరిమానా విధించింది రాంపూర్ కోర్టు. ఏప్రిల్ 18, 2019 న, ధమర గ్రామంలో జరిగిన బహిరంగ సభలో విద్వేషభరితమైన ప్రసంగం చేసినందుకు ఆజంఖాన్ పై కేసు నమోదు అయ్యింది. అప్పట్లో ఈ ప్రసంగానికి సంబంధించి వీడియో వైరల్ గా మారింది.
Translate this News: