TDP: ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసేది నేనే అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామరాజు. RTV తో ఆయన ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. నియోజకవర్గ అభ్యర్థి మార్పుపై చంద్రబాబు అఫిషియల్ గా చెప్పలేదన్నారు. సీటు రఘురామ కృష్ణంరాజుకు వెళ్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
Also Read: వైఎస్ చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే? సంచలన విషయాలు బయటపెట్టిన సునీత!
చంద్రబాబు ఆదేశమే శిరోధార్యమన్నారు. కానీ, కార్యకర్తలు, అభిమానులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. కాగా, ఉండి సీటు రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో రామరాజు వర్గం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.