Rajiv Gandhi:కోర్టు నుంచి విడుదలైన రాజీవ్ గాంధీ హత్యకేసు నిందితులు!

రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను సుప్రీంకోర్టు విడుదల చేసింది. కోర్టు నుంచి విడుదల ఉత్తర్వులు పొందిన అనంతరం ఈ ముగ్గురు నిందితులు బుధవారం శ్రీలంకకు వెళ్లనున్నారు. నిందితులు శ్రీలంక పౌరసత్వం ఉండటంతో వారు అక్కడికి వెళ్లనున్నారు.

New Update
Rajiv Gandhi:కోర్టు నుంచి విడుదలైన రాజీవ్ గాంధీ హత్యకేసు నిందితులు!

రాజీవ్ గాంధీ హత్య కేసులో కోర్టు నుంచి విడుదలైన నిందితులు చాలా కాలం తర్వాత శ్రీలంకలోని వారి ఇంటికి వెళ్లనున్నారు.అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం మురుగన్ అలియాస్ శ్రీహరన్, జయకుమార్, రాబర్ట్ పాయస్ అనే నలుగురు నిందితులు శ్రీలంక విమానంలో తమ దేశానికి బయలుదేరారు. నవంబర్ 2022లో, రాజీవ్ గాంధీ హత్య కేసులో ఈ ముగ్గురు శ్రీలంక పౌరులతో సహా ఏడుగురు నిందితులను సుప్రీంకోర్టు విడుదల చేసింది.

నవంబర్ 2022లో సుప్రీంకోర్టు ఈ దోషులను విడుదల చేసిందని, ఆ తర్వాత వారిని కొన్ని ప్రత్యేక కారణాల వల్ల తిరుచిరాపల్లిలోని ప్రత్యేక శిబిరంలో ఉంచారు. వీరంతా నిన్న రాత్రి తిరుచిపలల్లి నుంచి  కొలంబో బయలుదేరారు.

ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత వారందరూ తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లవచ్చని తమిళనాడు ప్రభుత్వం గతంలో మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. వీరందరికీ స్వదేశానికి తిరిగి రావడానికి చెన్నైలోని శ్రీలంక హై కమిషన్ ఇప్పటికే ప్రయాణ పత్రాలను జారీ చేసింది.

ఈ హత్యకు సంబంధించిన పలువురు నిందితులు కూడా విడుదలయ్యారు. ఇటీవల విడుదలైన దోషుల్లో పెరారివాలన్, రవిచంద్రన్, నళిని ఉన్నారు. ఈ ఏడుగురు దోషులు 30 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపారు, ఆ తర్వాత వారందరూ విడుదలయ్యారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు