భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన నదులైన రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్, స్వాన్ తోపాటు ఇతర నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లు, పంట పొలాలు, భారీ వాహనాలన్నీ కూడా వరదల కొట్టుకుపోయాయి. కార్లు, బస్సులు, ఇళ్లు కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకు 4గురు ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల రహదారులన్నీ మూసుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లితోంది. వరదల ధాటికి రాష్ట్రంలో ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు విడిచారు.
పూర్తిగా చదవండి..50ఏళ్లలో ఏనాడూ చూడని వర్షాలు..హిమాచల్ప్రదేశ్లో భయానక పరిస్థితులు..!!
భారీ వర్షాలు..ఉప్పొంగుతున్న నదులు...హిమాచల్ ప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షానికి ప్రధాన నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. పలు ప్రాంతాల్లో వంతెనలు, భవనాలు వరద ధాటికి కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 3వేల కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లిందని ఆ రాష్ట్రం సీఎం తెలిపారు. వరదల కారణంగా 17మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భయానక పరిస్ధితులు నెలకొన్నాయి. 24గంటల పాటు ప్రజల ఇళ్లలో నుంచి బయటకు రావద్దంటూ రెడ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.
Translate this News: