Telangana: రాష్ట్రంలో నాలుగు రోజులు వానలే..వానలు!

తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం తమిళనాడు నుంచి రాయలసీమ పరిసర ప్రాంతాల వరకు విస్తరించి ఉందని అధికారులు పేర్కొన్నారు.

New Update
Telangana: తెలంగాణలో మరో రెండు రోజులు వానలే..వానలు!

Telangana: రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా ఉన్న ఆవర్తనం రాయలసీమ, పరిసర ప్రాంతాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

రాయలసీమ, పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం తమిళనాడు నుంచి రాయలసీమ పరిసర ప్రాంతాల వరకు విస్తరించి ఉందని చెప్పింది. సోమవారం నుంచి మంగళవారం వరకు సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

అంతే కాకుండా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలతో పాటు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, లో వానలు పడే అవకాశాలున్నాయి.

అలాగే, బుధ, గురువారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని సమాచారం.

Also Read: ఊడుస్తూ కోట్లు కూడబెట్టాడు..యూపీలో అధికారులకు షాక్

Advertisment
తాజా కథనాలు