హత్రాస్ ఘటన బాధితులను పరామర్శించనున్న రాహుల్ గాంధీ!

యూపీలోని హత్రాస్‌ జిల్లాలో జరిగిన బోలే బాబా ఆధ్యాత్మిక ప్రసంగంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు.ఈ విషయాన్నికాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

హత్రాస్ ఘటన బాధితులను పరామర్శించనున్న రాహుల్ గాంధీ!
New Update

యూపీలోని హత్రాస్‌ జిల్లాలో జరిగిన బోలే బాబా ఆధ్యాత్మిక ప్రసంగంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు.

యూపీలోని హధ్రాస్ జిల్లాలోని సికంద్రరావు ప్రాంతంలోని పుల్రాయి గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో ఆధ్యాత్మిక నాయకుడు బోలే బాబా ప్రసంగం జరిగింది. తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు. 20 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు సంతాపం తెలిపారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. హద్రాస్‌ ఘటన దురదృష్టకరం. రాహుల్ అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ నగరంలో ఆయన బాధిత ప్రజలతో చర్చించనున్నారని తెలిపారు.

#rahul-gandi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe