దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఆజాద్ పూర్ మార్కెట్ సందర్శించారు. అక్కడి దుకాణదారులతో మాట్లాడి ధరలు అడిగి తెలుసుకున్నారు. అన్ని కూరగాయల ధరలు కేజీ వంద రూపాయలకుపైగా ఉన్నాయని, టమాటాల ధర అయితే కేజీ 200 రూపాయలు దాటిందని తెలిపారు. కూరగాయలన్ని కేజీ వంద రూపాయలకు పైగా పలుకుతున్నాయని రామేశ్వర్ అనే వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యారు. రోజుకు కనీసం వంద రూపాయలైనా సంపాదించలేకపోతున్నానని వాపోయాడు. పెరిగిపోతున్న ధరలతో తమ లాంటి సామాన్యులు బతకలేకపోతున్నామని ఆవేదన చెందాడు. రాహుల్ గాంధీ మార్కెట్కు చేరుకున్న విషయం తెలుసుకున్న జనం ఒక్కసారిగా గుమ్మిగూడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
పూర్తిగా చదవండి..ఢిల్లీ కూరగాయల మార్కెట్లో రాహుల్ గాంధీ.. వీడియోలు వైరల్
దేశంలో మండిపోతున్న కూరగాయల ధరలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నా ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదని ఆరోపించారు. పేదలు, ధనికుల మధ్య అంతరం రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఆజాద్ పూర్ మార్కెట్ సందర్శించారు.
Translate this News: