పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం..పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు..!!

పూరి జగన్నాథుడి రథయాత్ర అంగరంగవైభవంగా ప్రారంభమైంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి పెద్దెత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో పూరి నగరం జనసంద్రాన్ని తలపిస్తోంది. హిందూ పురాణాల ప్రకారం జగన్నాథుడు తన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రలతో కలిసి పూరి నగరంలో విహరిస్తారు. ఈయాత్ర కోసం ప్రత్యేకంగా ఒక చెక్క రథాన్ని సిద్ధం చేశారు.

New Update
పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం..పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు..!!

ఒడిశాలోని పూరి పుణ్యక్షేత్రం భక్తుల జనసందోహంతో నిండిపోయింది. ఇక్కడ కొలువైన జగన్నాథుడి రథయాత్ర మంగళవారం ప్రారంభం అవుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతిఏడాది ఆషాడ మాసం శుక్లపక్షం విదియ రోజున జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ యాత్ర ఏకాదశి వరకు కొనసాగుతుంది. ఈ జగన్నాథుడి రథయాత్రలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్దెత్తున తరలివస్తుంటారు. దీంతో పూరి నగరమంతా భక్తుల జనసందోహంతో కిటకిటలాడుతుంది.

puri rath yatra 2023

పురాణాల ప్రకారం జగన్నాథుడు తన చెల్లెలు సుభద్ర, అన్న బలభద్రుడులతో కలిసి నగరమంతా రథంలో విహరిస్తారు. ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద చెక్క రథాన్ని కూడా సిద్దం చేశారు. ఈ రథాన్ని లాగినా..రథం తాళ్లను తాకినా..లేదంటే కదలించినా..ఎంతో పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఈ రథయాత్ర పూరిలోనే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తారు. దేశ రాజధాని ఢిల్లీ, భోపాల్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో జగన్నాథుని రథయాత్ర వైభవంగా జరుగుతుంది.

రథయాత్ర ప్రాముఖ్యత:
హిందూ క్యాలెండర్ ప్రకారం, రథయాత్ర ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండవ తేదీన జరుగుతుంది. ఈ రథయాత్ర పండుగ మొత్తం 10 రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున, జగన్నాథుడు అన్నయ్య బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి పూరి నగర పర్యటనకు బయలుదేరుతాడు. ఈ సమయంలో, ముగ్గురి విగ్రహాలను వేర్వేరు రథాలలో ప్రతిష్టించడం ద్వారా రథయాత్ర చాలా గొప్ప పద్ధతిలో జరుగుతుంది. ఈ రథయాత్ర సామరస్యం, సోదరభావం ఐక్యతకు చిహ్నం. ఈ యాత్రలో పాల్గొనేందుకు, స్వామివారి రథాన్ని లాగే భాగ్యం పొందేందుకు దేశంలోని వివిధ మూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. రథయాత్రలో ఎవరైతే పాల్గొంటారో వారికి సర్వ విధాల సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతుంటారు.

రథయాత్రకు సంబంధించి నమ్మకాలు:
పౌరాణిక విశ్వాసాల ప్రకారం, రథయాత్ర సమయంలో, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి రథంపై కూర్చొని వారి గుండిచా ఆలయానికి వెళతారు. గుండిచా దేవాలయం జగన్నాథుడి అత్తగారి ఇల్లు అని చెబుతుంటారు. ఇక్కడ ఈ ముగ్గురు 7 రోజులు విశ్రాంతి తీసుకుంటారు. దీని తరువాత, ఆషాడ శుక్ల పక్షం దశమి తిథి నాడు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవిని తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు