Psycho Lover: లవర్ కాదు కిల్లర్..50 సార్లు కత్తితో పొడిచి..!

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ప్రేమోన్మాది దాడి ఘటనలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో యువతి, సోదరుడి పృథ్వీపై శివకుమార్ అతిదారుణంగా హత్యచేశాడు. కత్తితో 50 సార్లు పొడిచి అతి కిరతకంగా చంపాడు. అయితే ఈ కేసులోని నిందితుడు శివకుమార్ ది మొదటి నుంచి ఉద్రిక్త స్వభావమేనని గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే ప్రేమ విషయంలో కన్న తండ్రి అతనిని మందలిస్తే తనను సుత్తితో కొట్టి చంపాడని అయితే ఈ హత్య విషయాన్ని గ్రామస్తులు బయటకు రానివ్వలేదని సమాచారం. పృథ్వి హత్య కేసు భయటికి రావడంతో పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. శివకుమార్ గతంలో చేసిన నేరాలకు సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా కూపీ లాగుతున్నారు.

New Update
Psycho Lover: లవర్ కాదు కిల్లర్..50 సార్లు కత్తితో పొడిచి..!

Psycho Lover: రంగారెడ్డి జిల్లా నేరెళ్లచెరువు గ్రామానికి చెందిన శివకుమార్ ఆదివారం దారుణానికి తెగబడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదని క్లాస్ మేట్ సంఘవిపై దాడికి యత్నించాడు. అడ్డుకున్న సంఘవి సోదరుడు పృథ్వీని కత్తితో 50 సార్లు పొడిచి అతి కిరతకంగా చంపాడు. ఎల్బీనగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం నేరెళ్లచెరువు గ్రామానికి చెందిన శివకుమార్.. షాద్ నగర్ లోని స్కూల్ లో తనతో పాటు చదువుకున్న సంఘవిని ప్రేమించాడు. అప్పటి నుంచే సంఘవిని ప్రేమ పేరుతో వేధించేవాడు.

టెన్త్ తర్వాత సంఘవి కుటుంబం హైదరాబాద్(Hyderabad)లోని ఎల్బీనగర్(LB Nagar) లోని అద్దె ఇంట్లోకి మారింది. రామాంతపూర్ లోని హోమియో కాలేజీలో సంఘవి నాలుగో సంవత్సరం చదువుతుండగా.. ఆమె సోదరుడు పృథ్వీ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. శివకుమార్ డిగ్రీ పూర్తి చేసి రామాంతపూర్ లో ఉంటున్నాడు. ఇటీవల సంఘవిని కలిసి మరోమారు తన ప్రేమ విషయం చెప్పగా.. సంఘవి అతనిని మందలించినట్లు సమాచారం. దీంతో పగబట్టిన శివకుమార్..సంఘవి ఇంటికి వెళ్లి కత్తితో దారుణానికి తెగబడ్డాడు.

శరీరమంతా రక్తం..ప్రాంక్..

సంఘవి పై దాడి కేసులో ప్రత్యక్ష సాక్షి కీలక విషయాలను వెల్లడించింది. పైనుండి గట్టిగా అరుపులు రావడంతో రక్తంతో ఉన్న పృథ్వీ కిందికి పరిగెత్తుతుండగా చూసి ఏం జరిగిందంటూ అడగడం జరిగిందని..శరీరమంతా రక్తంతో ఉండడంతో మొదటగా ప్రాంక్ చేస్తున్నారేమోనని అనుకున్నానని తెలిపింది. ఆ వెంటనే గట్టిగా అరుస్తూ బయట వాళ్ళని పిలవడం జరిగిందని అయితే ఎవరూ లేకపోవడంతో తానే కర్రను తీసుకొని పైకి వెళ్లి రూమ్ కు గడియ పెట్టానని చెప్పింది. వెంటనే తన భర్తకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించినట్లు వెల్లడించింది. ఎవరైనా సరైన సమయానికి వచ్చింటే పృథ్వీను కాపాడుకునే వారమని తెలిపింది. గతంలో ఎప్పుడూ కూడా దాడి చేసిన వ్యక్తిని అక్కడ చూడలేదంటూ పేర్కొంది. పృథ్వీ ని హాస్పిటల్ కి తరలించిన అనంతరం కూడా సంఘవిపై శివకుమార్ దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. తన భర్త వచ్చినా అనంతరం ఆ యువకుడిని బెదిరించి సంఘవిని ఇంట్లో నుండి బయటకు తీసుకొచ్చమని చెప్పింది. అనంతరం పోలీసులు వచ్చి నిందింతుడిని అరెస్ట్ చేశారని తెలిపింది.

Advertisment
తాజా కథనాలు