Pruthviraj Sukumaran : లగ్జరీ కారు కొన్న 'సలార్' నటుడు.. ఎన్ని కోట్లో తెలుసా?

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. సరికొత్త పోర్షే మోడల్ కు చెందిన ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.3 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
Pruthviraj Sukumaran : లగ్జరీ కారు కొన్న 'సలార్' నటుడు.. ఎన్ని కోట్లో తెలుసా?

Pruthviraj Sukumaran Buys A Luxury Car : మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ గత ఏడాది వచ్చిన 'సలార్' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ వరదరాజ మన్నార్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రీసెంట్ గా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన 'బడే మియా చోటే మియా' సినిమాలో విలన్ గా మెప్పించాడు.

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ హీరో తాజాగా ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. సరికొత్త పోర్షే మోడల్ కు చెందిన ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.3 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోర్షే ఇండియా బ్రాండ్ ప్రతినిధులతో పృథ్వీరాజ్ మాట్లాడుతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇందులో అతనితో పాటు భార్య సుప్రియా మీనన్ కూడా ఉన్నారు.

Also Read : డిఫెరెంట్ టైటిల్ తో వస్తున్న సుప్రీమ్ హీరో.. సాయి తేజ్ కొత్త సినిమా పేరు అదేనా!

కాగా.. పృథ్వీరాజ్ ఇప్పటికే లంబోర్గిని, పోర్స్చే, టాటా సఫారి, మినీ కూపర్ లాంటి మోడల్ కార్లు కలిగి ఉన్నారు. ఇక ఇప్పుడు అయన గ్యారేజిలో మరో లగ్జరీ కారు కూడా చేరింది. ఒక పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం లూసిఫర్ 2, ఎంపురాన్ షూట్‌తో బిజీగా ఉన్నాడు. వీటిలో లూసిఫర్ 2 లో నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Porsche India (@porsche_in)

Advertisment
Advertisment
తాజా కథనాలు