Priyanka Gandhi: బీజేపీని బొంద పెట్టాలి.. తెలంగాణ పర్యటనలో ప్రియాంక గాంధీ ఫైర్

TG: పదేళ్లలో దేశాన్ని సర్వనాశనం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో బొంద పెట్టాలని ప్రియాంక గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ అబద్ధాలు నమ్మి మోసపోయేది లేదని చాటి చెప్పాలని కోరారు. అసలు ఈ రాష్ట్రానికి ఏం చేశారో బీజేపీని అడగాలని సూచించారు.

Priyanka Gandhi: బీజేపీని  బొంద పెట్టాలి.. తెలంగాణ పర్యటనలో ప్రియాంక గాంధీ ఫైర్
New Update

Priyanka Gandhi: బీజేపీ పై విమర్శల దాడికి దిగారు కాంగ్రెస్ మహిళా నాయకురాలు ప్రియాంక గాంధీ పదేళ్లలో దేశాన్ని సర్వనాశనం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో బొంద పెట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. శనివారం తాండూరు జనజాతర సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ అబద్ధాలు నమ్మి మోసపోయేది లేదని చాటి చెప్పాలని కోరారు. అసలు ఈ రాష్ట్రానికి ఏం చేశారో బీజేపీని అడగాలని సూచించారు. మత విద్వేషాలు ఇక్కడ సాగవని.. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులని అన్నారు. మత కల్లోలాలు ఉంటే.. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని తెలిపారు. మోడీ పదేళ్ల కాలంలో ధనిక వర్గాలకు మాత్రమే మేలు జరిగిందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతం ఎంతో సుభిక్షమైనదని.. ఎంతో కృషి చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని అన్నారు.

ఆ ఐదుగురికే ప్రయోజనాలు..

బీజేపీ హయాంలో కేవలం ఐదారుగురు మాత్రమే ధనికులు అయ్యారని విమర్శించారు. ఆ ఐదారుగురి ప్రయోజనాల కోసమే మోడీ పనిచేస్తున్నారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల గురించి మోడీ ఏనాడూ ఆలోచించలేదని మండిపడ్డారు. సామాన్య జనంపై టాక్స్ పెంచి.. కార్పొరేట్లపై తగ్గిస్తున్నారని తెలిపారు. పదేళ్లలో ఇదే మోడీ సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. మరోసారి బీజేపీ నమ్మొద్దని.. సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. మోడీని గద్దె దింపేందుకు దేశ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు.

#priyanka-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe